జగన్‌ అక్రమాస్తుల కేసుల విచారణ 22కు వాయిదా!

149

ఏపీ సీఎం జగన్‌పై ఈడీ నమోదు చేసిన అక్రమాస్తుల కేసుల విచారణ వాయిదా పడింది. ఈ కేసులను సీబీఐ ప్రత్యేక కోర్టు ఈ నెల 22కు వాయిదా వేసింది.

సీబీఐ కేసులతో సంబంధం లేకుండా ఈడీ కేసులను విచారించవచ్చని కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టులో సవాలు చేశామని విజయసాయిరెడ్డి తరపు న్యాయవాది తెలిపారు.

ఈడీ కేసులపై విచారణను వాయిదా వేయాలని న్యాయవాది కోర్టును అభ్యర్థించారు.

అనుమతించిన సీబీఐ కోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్ మధుసూదనరావు కేసు విచారణను 22వ తేదీకి వాయిదా వేశారు.

అలాగే హెటిరో, అరబిందో వ్యవహారంలో ఈడీ నమోదు చేసిన కేసులో సహ నిందితుడిని అనుమతించాలంటూ జగన్ దాఖలు చేసిన పిటిషన్‌లో

కౌంటరు దాఖలుకు ఈడీ గడువు కోరడంతో విచారణను 22వ తేదీకి వాయిదా వేశారు.

అయితే పెన్నా, రఘురాం సిమెంట్స్‌ సీబీఐ చార్జిషీట్లపై విచారణ కొనసాగింది. పెన్నా కేసు శుక్రవారానికి, రఘురాం సిమెంట్స్‌ కేసు ఈ నెల 15కు కోర్టు వాయిదా వేసింది.