మొదటి భార్య వేధింపులతో భర్త ఆత్మహత్యాయత్నం!

326
హైవేపై ట్రక్కు భీభత్సం.. ఇద్దరు చిన్నారులు సహా ఐదుగురు మృతి AddThis Sharing Buttons Facebook Twitter LinkedIn Messenger Telegram హైవేపై ట్రక్కు భీభత్సం.. ఇద్దరు చిన్నారులు సహా ఐదుగురు మృతి ముంబై‌: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బీద్‌‌-పర్లీ హైవేపై ఓ ట్రక్కు భీభత్సం సృష్టించింది. అతివేగంగా వెళ్తున్న ట్రక్కు ఆటో, బైకు, మరో వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతిచెందగా, మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. ఆదివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో ఓ ఆటో మద్వానీ నుంచి బీడ్‌ వైపు వెళ్తున్నది. ఈ క్రమంలో వేగంగా దూసుకొచ్చిన ట్రక్కు.. ఆటోను ఢీకొట్టింది. అంతటితో ఆగకుండా మోటార్‌ సైకిల్‌ను మరో ఫోర్‌ వీలర్‌ను గుద్దింది. అనంతరం రోడ్డు పక్కను ఉన్న ఓ గుంతలో పడిపోయింది. దీంతో ఇద్దరు చిన్నారులు సహా ఐదుగురు అక్కడికక్కడే మరణించగా మరో ఎనిమిది మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఐదుగురు ఆటలో ప్రయాణిస్తున్నవారుకాగా, ఇద్దరు ఫోర్‌ వీలర్‌, బైక్‌పై వెళ్తున్న వ్యక్తి గాయపడ్డారు. దీంతో వారిని బీడ్‌, ఔరంగాబాద్‌ దవాఖానలకు తరలించారు. కాగా, ప్రమాదానికి కారణమైన ట్రక్కు డ్రైవర్‌ పరారయ్యాడని పోలీసులు తెలిపారు. TAG Maharashtra Beed Accident Truck Auto Rickshaw Beed-Parli highway

మొదటి భార్య వేధింపులతో భర్త నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

ఈ సంఘటన హైద్రాబాద్ చాదర్‌ఘాట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకున్నది.

పోలీసుల కథనం ప్రకారం… మలక్‌పేట వాహెద్‌నగర్‌ ప్రాంతానికి చెందిన మొజం అలీఖాన్‌కు అలహాబాద్‌ ప్రాంతానికి చెందిన నిషాత్‌ ఖాన్‌తో 2003లో వివాహం జరిగింది.

ఇటీవల మొజం అలీఖాన్‌ మొదటి భార్యకు తెలియకుండా రెండో పెండ్లి చేసుకున్నాడు.

దీంతో మొదటి భార్య వేధిస్తుండటంతో ఆమెను పుట్టింటికి పంపించాలని అలీఖాన్‌ ఆదివారం సాయంత్రం పోలీసులను ఆశ్రయించాడు.

పుట్టింటికి పంపించే అధికారం తమకు లేదని.. కౌన్సెలింగ్‌ మాత్రమే ఇస్తామని చెప్పి పోలీసులు అలీఖాన్‌ ను వెనక్కి పంపించారు.

పోలీసులు తన ఫిర్యాదును పట్టించుకోలేదని ఆవేదనతో అలీఖాన్‌ నిద్రమాత్రలు మింగుతున్నట్లు సోషల్‌ మీడియాలో పెట్టిన వీడియో వైరల్‌ అయ్యింది.

పోలీసులు గమనించి సకాలంలో అతడిని ఆసుపత్రికి తరలించారు. నిషాత్‌ ఖాన్‌ ఫిర్యాదు మేరకు మొజం అలీఖాన్‌పై కేసు నమోదు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.