
మహారాష్ట్రలో కరోనా మళ్లీ మహోగ్రరూపం దాల్చడంతో కేసులు పెర్గుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనాను నియంత్రించేదుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
రాష్ట్రంలోని అమరావతి, అకోలా, బుల్దానా, వాషిం, యావత్మాల్ జిల్లాలలో వారం రోజులపాటు లాక్డౌన్ విధిస్తున్నట్టు ప్రకటించింది.
నేటి రాత్రి నుంచి మార్చి 1 వరకు ఇది అమల్లో ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
అలాగే నేటి నుంచి పూణె, నాసిక్ నగరాల్లో రాత్రి కర్ఫ్యూను అమలు చేయనున్నారు.
శుక్రవారం నాడు పరిస్థితిని సమీక్షించిన అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటారు.
విద్యాసంస్థలను కూడా ఈ నెలాఖరు వరకు మూసివేయాలని నిర్ణయించినట్టు అధికారులు తెలిపారు.
గత రెండు వారాల్లో 2,500 నుంచి ఏడు వేలకు కోవిడ్ కేసులు పెరిగాయని, పరిస్థితి ఇలానే ఉంటే రాష్ట్ర వ్యాప్త లాక్డౌన్పై ఆలోచిస్తామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే పేర్కొన్నారు.