దేశంలో 1,09,77,387కు చేరిన కరోనా కేసులు

169
75% cases Maharashtra and Kerala!

దేశంలో గత 24 గంటల్లో 13,993 మందికి కరోనా నిర్ధారణ అయినట్టు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

ఈ రోజు ఉదయం విడుదల చేసిన గణాంకాల ప్రకారం గత 24 గంటల్లో 10,307 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఇక దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,09,77,387కు చేరింది.

గడచిన 24 గంట‌ల సమయంలో 101 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,56,212 కు పెరిగింది.

దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,06,78,048 మంది కోలుకున్నారు. 1,43,127 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.

జనవరి 16 న ప్రారంభమయిన కరోనా వ్యాక్సినేషన్ వేగంగా కొనసాగుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు 1,07,15,204 మందికి కరోనా వ్యాక్సిన్ వేశారు.

నిన్నటి వరకు మొత్తం 21,02,61,480 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది.