దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం!

157

గత 10 నెలలుగా దేశంలో మహోగ్రరూపం చూపిన కరోనా వైరస్ ఇప్పుడు తగ్గుముఖం పట్టినట్టు తెలుస్తోంది.

గడిచిన 24 గంటల్లో కొత్తగా 9,309 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ శుక్రవారం తెలిపింది.

కొత్తగా నమోదైన కేసులతో మొత్తం 1,08,80,603కు చేరాయి.తాజాగా మరో 15,858 మంది ఆయా ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు.

కోలుకున్న వారి సంఖ్య 1,05,89,230కు చేరింది. మరో 87 మంది వైరస్‌ సోకి మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,55,447కు పెరిగింది.

ప్రస్తుతం దేశంలో 1,35,926 యాక్టివ్‌ కేసులున్నాయని ఆరోగ్యశాఖ వివరించింది.

జాతీయ రికవరీ రేటు 97.32 శాతంగా ఉందని మంత్రిత్వశాఖ తెలిపింది. టీకా డ్రైవ్‌లో ఇప్పటి వరకు 75,05,010 మందికి వ్యాక్సిన్‌ వేసినట్లు పేర్కొంది.