దేశంలో కొత్తగా 13 వేల కోవిడ్ కేసులు

165
Corona to the staff .. Restaurant‌ siege

దేశంలో కరోనా మళ్లీ విజృంభించడంతో రోజురోజుకూ కొత్త కేసులు ఊపందుకొంటున్నాయి.

కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు వెల్లడించిన గణాంకాల ప్రకారం గత 24 గంటల్లో 13,742 మందికి కరోనా నిర్ధారణ అయింది.

అదే స‌మ‌యంలో 14,037 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,10,30,176 కు చేరింది.

గడచిన 24 గంట‌ల సమయంలో 104 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,56,567 కు పెరిగింది.

దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,07,26,702 మంది కోలుకున్నారు. 1,46,907 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స పొందుతున్నారు.

ఇప్ప‌టివ‌ర‌కు దేశవ్యాప్తంగా 1,21,65,598 మందికి వ్యాక్సిన్ వేశారు.నిన్నటి వరకు మొత్తం 21,30,36,275 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది.