మైనర్‌ బాలికపై అత్యాచారం..ఇద్దరు వ్యక్తులు అరెస్ట్‌

211
Rape of a young woman saying give finance!

మహిళలు, బాలికలపై లైంగిక దాడులకు పాల్పడేవారికి కఠిన శిక్షలు అమలవుతున్నప్పటికే దేశంలో ఏదో ఒక ప్రాంతంలో ఈ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.

తాజాగా రాజస్థాన్‌లో ఓ మైనర్‌ బాలిపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు.

చురు జిల్లాలోని సదర్‌షహర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఈనెల 8న ఓ బాలికను కిడ్నాప్ చేశారు.

అనంతరం శివారు ప్రాంతానికి తీసుకెళ్లి ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదుమేరకు సదర్‌షహర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

దాడికి పాల్పడ్డ నిందితులిద్దరిని అరెస్టు చేశారు. వారిలో ఓ మైనర్‌ బాలుడు కూడా ఉన్నాడు.

వీరిద్దరిపై నిర్భయ సెక్షన్‌ కింద కేసు నమోదు చేశారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.