రెండోసారి కరోనా బారిన పడ్డ మంత్రి

196
Corona to the staff .. Restaurant‌ siege

మహారాష్ట్రలో చాపకింద నీరులా కరోన వైరస్ మళ్లీ విజృంభిస్తుంది. మూడున్నర నెలల తర్వాత నిన్న మళ్లీ రాష్ట్రంలో భారీ స్థాయిలో కోవిడ్ కేసులు నమోదయ్యాయి.

గతేడాది సెప్టెంబరులో కరోనా బారినపడి కోలుకున్న మహారాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి బచ్చు కడుతోపాటు ఎన్సీపీ నేత, మాజీ మంత్రి ఏక్‌నాథ్ ఖడ్సే రెండోసారి కరోనా బారినపడ్డారు.

ఖడ్సేకు గతేడాది నవంబరులో కరోనా సోకగా చికిత్స అనంతరం బయటపడ్డారు. తాజాగా తాము రెండోసారి కరోనా వైరస్ బారినపడినట్టు వీరిద్దరూ ట్విట్టర్ ద్వారా తెలిపారు.

మహారాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 6,112 కేసులు నమోదయ్యాయి.

నిన్న నమోదైన కేసుల్లో అకోలా, పూణె, ముంబై డివిజన్‌లలోనే అత్యధికంగా వెలుగు చూసినట్టు అధికారులు తెలిపారు.

తాజా కేసులతో కలుపుకుని రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 20,87,632కు చేరినట్టు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.

కాగా, కరోనా కారణంగా నిన్న 44 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరితో కలుపుకుని రాష్ట్రంలో కరోనాకు బలైన వారి సంఖ్య 51,713కు చేరింది.