దేశంలో కొత్త‌గా 16,488 కోవిడ్ కేసులు

195
75% cases Maharashtra and Kerala!

దేశంలో గత 24 గంటల్లో 16 వేల 488  మందికి కోవిడ్ సోకినట్టు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

ఈ రోజు ఉదయం విడుదల చేసిన గణాంకాల ప్రకారం 16,488 మందికి కొత్త‌గా కరోనా నిర్ధారణ అయింది.

అదే స‌మ‌యంలో 12,771 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,10,79,979కు చేరింది.

గడచిన 24 గంట‌ల సమయంలో 113 మంది కరోనా కారణంగా మృతి చెందారు.

దీంతో మృతుల సంఖ్య 1,56,938కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,07,63,451 మంది కోలుకున్నారు.

1,59,590 మంది ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స పొందుతున్నారు.

దేశవ్యాప్తంగా నిన్నటి వరకు మొత్తం 21,54,35,383 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) వెల్లడించింది.