మెట్రో రైలులో ‘గుండె’ త‌ర‌లింపు!

365
metro train Hyd-

‌హైద‌రాబాద్ మెట్రో రైలులో తొలిసారిగా గుండెను తరలించారు. బ్రెయిన్ డెడ్ అయిన మ‌నిషి గుండెను త‌ర‌లించేందుకు ఏర్పాట్లు చేశారు వైద్యులు. కామినేని ఆస్ప‌త్రి వైద్యులు జూబ్లీహిల్స్‌ అపోలోకు గుండెను త‌ర‌లించ‌నున్నారు. గుండె మార్పిడి శస్త్రచికిత్సకు వైద్యులు ఏర్పాట్లు చేస్తున్నారు.

న‌ల్ల‌గొండ జిల్లాకు చెందిన 45 ఏండ్ల రైతు బ్రెయిన్ డెడ్ అయ్యాడు. దీంతో గుండెను దానం చేసేందుకు ఆ రైతు కుటుంబం ముందుకొచ్చింది. దీంతో రైతు గుండెను మరో వ్య‌క్తికి వైద్యులు అమ‌ర్చ‌నున్నారు.

నగరంలోని జూబ్లీహిల్స్ అపోలో ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న మ‌రో వ్య‌క్తికి గుండె మార్పిడి శ‌స్ర్త‌చికిత్స‌కు వైద్యులు ఏర్పాట్లు చేశారు. డాక్ట‌ర్ గోకులే నేతృత్వంలో ఈ శ‌స్ర్త‌చికిత్స నిర్వ‌హించ‌నున్నారు. ఎల్బీన‌గ‌ర్ కామినేని ఆస్ప‌త్రి నుంచి జూబ్లీహిల్స్ అపోలో ఆస్ప‌త్రికి గుండెను మ‌ధ్యాహ్నం త‌ర‌లించ‌నున్నారు.